Suresh Pillai

శీలా వీర్రాజు వ్యక్తిత్వంలో సహస్రాంశం దక్కితే చాలు

సుప్రసిద్ధ కథారచయిత, కవి, చిత్రకారులు శీలా వీర్రాజు పేరిట ఏర్పాటైన శీలా వీర్రాజు కథానికా పురస్కారం 2025 ను కె.ఎ. మునిసురేష్ పిళ్లె తన కథా సంపుటి గారడీవాడుకు గాను అందుకున్నారు. ఆ కార్యక్రమంలో సురేష్ పిళ్లె ధన్యవాద ప్రసంగం ఇది.

సాహిత్యంలో, చిత్రకళా రంగంలో దక్కించుకున్న కీర్తిని మించిన సహృదయుడు, ఆప్తజన వత్సలుడు.. శీలా వీర్రాజు గారి పేరిట కథానికా పురస్కారాన్ని అందుకోవడం నేను చాలా గర్వంగా భావిస్తున్నాను. అందుకు సుభద్రాదేవి గారికి మరోమారు కృతజ్ఞతలు.. అంటున్నారు రచయిత, శీలా వీర్రాజు కథానికా పురస్కారం గ్రహీత మునిసురేష్ పిళ్లె. శీలా వీర్రాజు గారి పేరిట అవార్డు దక్కిన తీరులోనే.. ఆయన స్నేహశీలత, వ్యక్తిత్వంలో సహస్రాంశమైనా దక్కాలని కూడా కోరుకుంటున్నాను. అన్నారు. అవార్డుకు తనను ఎంపిక చేసిన శీలా సుభద్రా దేవి గారికి కృతజ్ఞతలు తెలిపారు. కథారచయిత ఎమ్వీ రామిరెడ్డి గారడీవాడు సంపుటిని సమీక్షించారు.

Comments

Leave a Reply