గారడీవాడు కథా సంపుటికి శీలా వీర్రాజు కథానికా పురస్కారం 2025 లభించింది.
2023లో వెలువడిన ఈ కథాసంపుటికి ఇది నాలుగో పురస్కారం.
పురస్కార ప్రదానోత్సవం రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాలులో జూన్ 7వ తేదీ శనివారం సాయంత్రం జరిగింది. ప్రముఖ కథారచయిత శ్రీ విహారి, తెలంగాణ సాంస్కృతికశాఖ డైరక్టరు శ్రీ మామిడి హరికృష్ణ, సినీ దర్శకుడు శ్రీ ఇంద్రగంటి మోహనకృష్ణ, రామ్కీ ఫౌండేషన్ సీఈఓ, ప్రముఖ రచయిత ఎమ్వీ రామిరెడ్డి, ప్రముఖ చిత్రకారులు శీలావీ చిత్రకళా పురస్కార గ్రహీత పిఎస్ చారి తదితరులు అతిథులుగా హాజరయ్యారు.
[huge_it_gallery id=”2″]
