Suresh Pillai

బాగా మధనపడినప్పుడే రాయడం నా అలవాటు

సారంగ యూట్యూబ్ ఛానెల్ లో పబ్లిష్ అయిన వీడియో

కె.ఎ. మునిసురేష్ పిళ్లె జర్నలిస్టు- రచయిత. ఆయన తాజాగా ‘శీలా వీర్రాజు కథానికా పురస్కారం 2025’ అందుకోబోతున్నారు. సుప్రసిద్ధ రచయిత, చిత్రకారులు శీలా వీర్రాజు పేరిట ఏర్పాటైన శీలావీ సాహితీ చిత్రకళా వేదిక తరఫున శీలా సుభద్రాదేవి ఈ పురస్కారం ప్రకటించారు. గారడీవాడు కథాసంపుటికి గాను.. మునిసురేష్ పిళ్లె ఈ పురస్కారానికి ఎంపికయ్యారు.

‘గారడీవాడు’ 15 కథలు సంపుటి. అన్ని కథలు కూడా ఒకదానితో ఒకటి పోల్చడానికి వీల్లేకుండా భిన్నమైన కథాంశాలతో రాసిన కథలు. ఈ కథలను ‘తిరుపతి లడ్డూలు’గా అభివర్ణిస్తూ.. తనికెళ్ల భరణి ఈ పుస్తకానికి ముందుమాట రాశారు. ఈ సంపుటిలోని 4 కథలు.. ఇఫ్తార్, రిఫ్రెష్ ఫ్రం టియర్స్, స్కోర్ అయిటమ్, @18 ‘సారంగ’లో ప్రచురితం అయ్యాయి. మరో ఆరు కథలు వివిధ పత్రికల్లో ప్రచురణ కాగా.. మిగిలినవి వివిధ సంస్థల పోటీల్లో బహుమతులు సాధించాయి.

‘ఇఫ్తార్ కథ వెనుక కథ’ వ్యాసం, టీనా అనే కథ గురించి ఆర్.ఎం. ఉమామహేశ్వరరావు ‘సారంగ’లో రాసిన విశ్లేషణ ‘గుప్పెడు ప్రేమకు భరోసా టీనా’ అనే వ్యాసం కూడా ఈ సంపుటిలో ఉన్నాయి.

Comments

Leave a Reply